Sunday, 05 April 2026 05:42:43 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పంట నష్టాలపై ప్రభుత్వం స్పందించాలి: మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 04 April 2026 07:51 PM Views : 17

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కోరుట్ల /జగిత్యాల : : రాయికల్, అక్షరం న్యూస్, ఏప్రిల్ 04 పంట నష్టాలపై ప్రభుత్వం స్పందించాలని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రాయికల్ పట్టణంలోని కోయడి మహిపాల్ రెడ్డి ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రకృతి వైపరీత్యాలతో మొక్కజొన్న, మామిడి పంటలు నేలపాలయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. పంటల బీమా పథకం అమలు లేకపోవడంతో రైతులకు ఎలాంటి పరిహారం అందడం లేదని విమర్శించారు. రైతు భరోసా పథకాన్ని ఎకరాల పరిమితి లేకుండా ఎకరానికి రూ.6000చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,400ఉన్నప్పటికీ రైతులకు రూ.1,800మాత్రమే లభిస్తున్నదని, దీనితో దళారులు లాభ పడుతున్నారని అన్నారు. రాయికల్ లో కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడాన్ని తప్పుబట్టారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20, 000పరిహారం ఇవ్వాలని, రైతు బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఏప్రిల్ 15వరకు ఎస్ఆర్ఎస్పి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :