GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/ఆగస్టు 16/అక్షరం న్యూస్- నేతి బీరకాయలో నెయ్యి ఎంతో .....బిజెపి పార్టీలో దేశభక్తి అంత ....!?.79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని హుజురాబాద్ రోడ్డులో కల బిజెపి పట్టణ కార్యాలయంలో జాతీయ పథకాన్నిఎగురవేసి అవమానించారు. బిజెపి నాయకులు. వివరాల్లోకి వెళ్తే జమ్మికుంట పట్టణంలో గల బిజెపి కార్యాలయం ముందు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కానీ ఆగస్టు 15 సాయంత్రం అవనతం చేయాల్సి ఉండగా మరుసటి రోజు (ఆగస్టు 16) శనివారం రోజు 11:30 వరకు జాతీయ జెండా కిందకు దింపకుండా జాతీయ జెండాను అవమానించారు. బిజెపి మాట్లాడితే దేశం కోసం దేశ ప్రయోజనాల కోసం పనిచేసే ఏకైక పార్టీ బిజెపి అని, బిజెపి పార్టీకి తప్ప దేశభక్తి ఏ పార్టీకి లేదని గొప్పలు చెప్పుకునే నాయకులు జాతీయ జెండాను ఈ విధంగా అవమానించడం ఏంటని పలువురు రాజకీయ నాయకులు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .దేశం కోసం అహర్నిశలు పాటుపడతామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే బిజెపి నాయకులు దేశానికే గర్వకారమైన జాతీయ జెండాను అవమానించడం పట్ల దేశంపై బీజేపీకి పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదొ ఇట్లే అర్థమవుతుందని పలువురు పురవాసులు తీవ్ర ఆక్రష్యాన్ని వెలగకుతున్నారు. సదర్ విషయంపై మున్సిపల్ అధికారులతో పాటు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జాతీయ జెండా గౌరవాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మేధావి వర్గం కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily