AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : కరీంనగర్/ఇల్లందకుంట/సెప్టెంబర్ 01/అక్షరం న్యూస్: మండలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఇంచార్జి కార్యనిర్వహణాధికారిగా బి. సదయ్య సోమవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఇప్పటివరకు ఇంచార్జి కార్యనిర్వహణాధికారిగా కొనసాగుతున్న కె. సుధాకర్ నుండి బి. సదయ్య బాధ్యతలు స్వీకరించారు. బి. సదయ్య ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తూ, అదనపు బాధ్యతగా ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily