D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 7 (అక్షరం న్యూస్) మున్సిపాలిటీల పరిధిలో ఓటరుగా నమోదై ఉండి, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న జిల్లా, ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు (ఫిబ్రవరి 8న) ఆదివారం ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు మునిసిపాలిటీల పరిధిలో కేటాయించిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఖమ్మం రూరల్ ఎంపీడీవో కార్యాలయం మీటింగ్ హాల్ లో, మధిర మున్సిపాలిటీలో మధిర ఎంపీడీవో కార్యాలయం మీటింగ్ హాల్ లో, కల్లూరు మున్సిపాలిటీలో కల్లూరు జిహెచ్ఎస్ లో, వైరా మున్సిపాలిటీలో వైరా తహసీల్దార్ కార్యాలయంలో, సత్తుపల్లి మున్సిపాలిటీలో సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ లు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమకు కేటాయించిన కేంద్రాలలో తప్పనిసరిగా హాజరై పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, సంబంధిత శాఖాధికారులు ఈ సమాచారాన్ని తమ శాఖ సిబ్బందికి అత్యవసరంగా తెలియజేయాలని జిల్లా ఎన్నికల అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
.
Aksharam Telugu Daily