Monday, 16 February 2026 04:36:36 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

నేడు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకోవాలి... జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోస

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 07 February 2026 05:59 PM Views : 85

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 7 (అక్షరం న్యూస్) మున్సిపాలిటీల పరిధిలో ఓటరుగా నమోదై ఉండి, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న జిల్లా, ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు (ఫిబ్రవరి 8న) ఆదివారం ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు మునిసిపాలిటీల పరిధిలో కేటాయించిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఖమ్మం రూరల్ ఎంపీడీవో కార్యాలయం మీటింగ్ హాల్ లో, మధిర మున్సిపాలిటీలో మధిర ఎంపీడీవో కార్యాలయం మీటింగ్ హాల్ లో, కల్లూరు మున్సిపాలిటీలో కల్లూరు జిహెచ్ఎస్ లో, వైరా మున్సిపాలిటీలో వైరా తహసీల్దార్ కార్యాలయంలో, సత్తుపల్లి మున్సిపాలిటీలో సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ లు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమకు కేటాయించిన కేంద్రాలలో తప్పనిసరిగా హాజరై పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, సంబంధిత శాఖాధికారులు ఈ సమాచారాన్ని తమ శాఖ సిబ్బందికి అత్యవసరంగా తెలియజేయాలని జిల్లా ఎన్నికల అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :