DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి ఫిబ్రవరి 6 అక్షరం న్యూస్; పెద్దపల్లి పట్టణంలోని 21వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేస్తున్న నూగిళ్ల మల్లయ్య ఎన్నికల ప్రచారంలో జోరు చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో కలిసి ఇంటింటా తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుగానే ప్రకటించడంతో ఈ వార్డులో రాజకీయ ఆసక్తి మరింత పెరిగింది. తాను గెలుపొందితే కౌన్సిలర్గా మాత్రమే కాకుండా మున్సిపల్ చైర్మన్గా పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని నూగిళ్ల మల్లయ్య ప్రజలకు హామీ ఇస్తున్నారు. తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రచారంలో వివరించారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయనున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, మంత్రి శ్రీధర్ బాబు అండదండలతో ఈ ప్రాంతాన్ని మరింత ప్రగతి బాటలో నడిపిస్తానని చెబుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో 21వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతోందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
.
Aksharam Telugu Daily