GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/హుజురాబాద్ : కరీంనగర్/హుజురాబాద్ /జనవరి 18/అక్షరం న్యూస్: ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేస్తున్న ప్రతి కార్మికునికి,ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం రోజున హుజూరాబాద్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 2026 కు సంబంధించిన నూతన డైరీని విశ్రాంతి ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తాను కట్టుబడి ఉన్నానని,దాంతో పాటు కొన్ని సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని వాటిని పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందరికి అందేలా తాను చూసుకుంటానని ఆ బాధ్యత నాది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ రిటైర్డ్ సంఘం ముఖ్య సలహాదారులు రవీందర్ రావు, పేరాల లక్ష్మణరావు ముఖ్య సలహాదారు ఎం రాజమౌళి మరియు ఆర్గనైజింగ్ కార్యదర్శిలు బొంగుని రాజమౌళి పిఎస్ రెడ్డి బత్తిని సంజీవ్ కొంపల్లి వెంకటరెడ్డి మేకల మల్లారెడ్డి గోలి ఉపేందర్ బి మొగిలి జి. సదానందం వేముల దేవేందర్ రెడ్డి కంకల కొమురయ్య తిరుమని కనకయ్య, మండ కనకయ్య, చక్రపాణి, తదితర కార్మిక, విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి సమావేశం లో సర్వీసులో ఉండి విశ్రాంత ఉద్యోగుల సంఘ సమావేశానికి విచ్చేసిన జిల్లా ఇన్చార్జ్ ఠాగూర్ శివ తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily