Monday, 16 February 2026 06:18:07 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

లక్ష్మీ–జంపయ్య దంపతులకు శాంతినగర్ ఓటర్ల అపూర్వ ఆదరణ

రెండో వార్డులో చెయ్యి గుర్తుకే పట్టం కట్టేందుకు సిద్ధమైన ప్రజలు ..లక్ష్మీ జంపయ్య ప్రచారానికి వెల్లువలా స్పందన


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 09 February 2026 12:24 PM Views : 114

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : .. పెద్దపల్లి ప్రతినిధి జనవరి 9 అక్షరం న్యూస్; పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని శాంతినగర్‌లో గల రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచిన లక్ష్మీ–జంపయ్య దంపతులు విజయకేతనం ఎగురవేస్తూ గెలుపు దిశగా వేగంగా దూసుకెళ్తున్నారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ, మద్దతు చూస్తే ఈ వార్డులో కాంగ్రెస్ విజయం ఖాయమన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. స్థానికంగానే నివసిస్తూ, ప్రతి కుటుంబంతో కలివిడిగా మెలిగే లక్ష్మీ జంపయ్య దంపతులపై ప్రజలకు ఉన్న విశ్వాసం ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తోంది. వార్డు సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండటంతో రెండో వార్డు ప్రజలు గట్టిగా బలపరుస్తున్నారు. “నన్ను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తా… ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కీలక పాత్ర పోషిస్తా” అంటూ లక్ష్మీ జంపయ్య దంపతులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అండదండలతో, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులతో రెండో వార్డు అభివృద్ధి కోసం ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. లక్ష్మీ జంపయ్య దంపతుల ప్రచారానికి శాంతినగర్ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ శక్తి మరింత బలపడింది. ఈ ఎన్నికల్లో చెయ్యి గుర్తుకే పట్టం కట్టేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :