Monday, 16 February 2026 06:16:55 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బాలికల ఆరోగ్య భద్రతపై రాజీ పడేది లేదు: ఎమ్మెల్యే గడ్డం వినోద్*

ఫుడ్ పాయిజన్ ఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఆస్పత్రిలో పరామర్శ • సమీకృత బాలికల వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ… బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 07 February 2026 04:11 PM Views : 94

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మంచిర్యాల జిల్లా : * •​​ మంచిర్యాల జిల్లా /​బెల్లంపల్లి / ఫిబ్రవరి 7 /అక్షరం న్యూస్ బెల్లంపల్లి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కు గురై అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పరామర్శించారు.సుమారు 20 మంది బాలికలు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే ఆయన హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికల ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని, చికిత్సలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఈ ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని, అధికారులను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ను కోరారు. సబ్ కలెక్టర్ మనోజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బాలికల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించారు. ​ *వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ:* ఆస్పత్రి సందర్శన అనంతరం ఎమ్మెల్యే నేరుగా సమీకృత బాలికల వసతి గృహానికి వెళ్లారు. అక్కడి వంటశాల, భోజన తయారీ విధానం, ఆహార నాణ్యత మరియు పరిశుభ్రతను స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "బాలికల ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదు. వసతి గృహాల్లో ఆహార నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి" అని స్పష్టం చేశారు. ఈ ఘటనకు కారణమైన అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.​ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రెవెన్యూ అధికారులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :