Sunday, 29 March 2026 03:33:50 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పోటీ చేయద్దురా అయ్యా బిడ్డ… ఓ తల్లి యావేదన * మున్సిపల్ ఎన్నికల్లో పెరుగుతున్న అప్పుల భారం * అయ్యా బిడ్డా… పైసలు లేవు. పోటీ చేస్తే అప్పుల పాలవుతావు. ద


OMKARI SRINIVAS, JAGITYAL.

Reporter

Date : 30 January 2026 06:16 PM Views : 171

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జగిత్యాల : జగిత్యాల/జనవరి 30/అక్షరం న్యూస్: ఇది ఏ ఒక్క తల్లి మాట కాదు. మున్సిపల్ ఎన్నికల వేళ వందల కుటుంబాల్లో వినిపిస్తున్న నిస్సహాయ స్వరం. మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగగా ఉండాల్సినవి. కానీ అవి నెమ్మదిగా అప్పుల పండుగగా మారుతున్నాయి. గెలుపు కోసం జరుగుతున్న ఖర్చు సామాన్య కుటుంబాల్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది. నామినేషన్ దాఖలుతోనే ఖర్చులు మొదలవుతాయి. ప్రచారం పేరుతో బ్యానర్లు, ఫ్లెక్సీలు, వాహనాలు, భోజనాలు, సమావేశాలు… ఒక్కో వార్డులో లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. పైగా పార్టీ ఒత్తిళ్లు, పోటీ అభ్యర్థుల ఆర్భాటం చూసి “మనమూ అంతే చేయాలి” అనే భావన అభ్యర్థుల్లో పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సామాన్య కుటుంబాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు అప్పులు చేసి రాజకీయాల్లోకి దిగుతున్నారు. గెలిచినా అప్పుల ఊబిలో నుంచి బయటపడటం కష్టమే. ఓడిపోతే పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఒత్తిడులు, మానసిక వేదనలు పెరుగుతున్నాయి. అందుకే ఓ తల్లి గుండె పగిలేలా చెబుతోంది – “పోటీ చేయొద్దు నాయనా… అప్పులపాలు అవ్వద్దు…” ప్రజాసేవ చేయాలనే ఆశ గొప్పదే. కానీ ప్రజాసేవ పేరు మీద కుటుంబాలను అప్పుల చెరలోకి నెట్టడం ఎంతవరకు సమంజసం? ఎన్నికల్లో ఖర్చు పరిమితులు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బు కాదు, అభ్యర్థి ఆలోచన, సేవా తత్వం ముఖ్యమయ్యే వ్యవస్థ రావాలి. లేదంటే మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండుగగా కాక, తల్లుల కన్నీళ్లకు కారణంగా మారే ప్రమాదం ఉంది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :