Monday, 02 March 2026 09:33:08 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పెగడపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 24 February 2026 07:06 AM Views : 60

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వశ్రీరాంపూర్/ ఫిబ్రవరి 23/ అక్షరం న్యూస్:మండలంలోని పెగడపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో సోమవారం నవ క్రాంతి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులతో పాటు గ్రామంలోని ప్రజలందరూ గుంపులు, గుంపులుగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గుండె స్కానింగ్, 2డిఎకో, బీపీ, షుగర్ వంటి ఖరీదైన పరీక్షలు నిర్వహించడంతో సుమారుగా 200 మంది రైతులు ప్రజలు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. అవసరం ఉన్నవారికి డాక్టర్లు ప్రెస్క్రిప్షన్ రాసిచ్చారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో దాదాపుగా 200 మంది రైతులు గ్రామ ప్రజలు వివిధ రకాలైన పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా నవ క్రాంతి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఐసిఎస్ మేనేజర్ టి. సతీష్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ తూండ్ల అరుణ మాట్లాడుతూ రైతులు, గ్రామ ప్రజల ప్రయోజనం కోసం ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించామని, ఇందులో రైతులు గ్రామస్తులు వేలాది రూపాయల విలువైన పరీక్షలు నిర్వహించుకున్నారని అన్నారు. ముఖ్యంగా రైతులు గ్రామస్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, నవ క్రాంతి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఐసిఎస్ మేనేజర్ టి. సతీష్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ తూండ్ల అరుణ, ఉప సర్పంచ్ పత్తి శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు, రైతులు, గ్రామస్తులు, పలువురు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :