DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్ / ఫిబ్రవరి 23/ అక్షరం న్యూస్:అధ్యాయన పర్యటనలో భాగంగా మండల మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మరియు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి భద్రాచలం మార్కెటింగ్ యార్డును అట్టి మార్కెట్ పరిధిలోని సర్వాక గ్రామంలో ఉన్నటువంటి రేగి పండు మరియు మల్బరీ తోటలను భద్రాచలం మార్కెట్ సెక్రటరీ, అగ్రికల్చర్ ఎడి తో కలిసి సందర్శించారు పట్టు పరిశ్రమ అభివృద్ధిని మరియు మల్బరీ సాగును పరిశీలించారు మల్బరి సాగుకు పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్షమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ సబ్బని రాయమల్లు, శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్ బంగారు రమేష్, పాలకవర్గ సభ్యులు దాగేటి రామచంద్రం, ఎనగంటి రవి ఆయా గ్రామాల కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ మాదాసు సతీష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సదయ్య యాదవ్, కాంగ్రెస్ నాయకులు లంక సదయ్య తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily