D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/ కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్తగూడ/ మార్చి 16(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని మైలారం చెరువు వైపు వెళ్లే రైతులకు, ప్రజలకు ఇక రహదారి కష్టాలు తీరనున్నాయి. నర్సంపేట ప్రధాన రహదారి నుండి మైలారం చెరువు వరకు కిలోమీటర్ మేర ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రోడ్డు పనులను సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ సోమవారం ఘనంగా ప్రారంభించారు అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ, వ్యవసాయ పనుల నిమిత్తం మైలారం చెరువు వైపు వెళ్లే రైతులకు ఈ రోడ్డు ఉపయోగపడుతుందని, ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడంతో పాటు గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తామని తెలిపారు తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు, కూలీలకు సూచించారు.కార్యక్రమంలో కార్యదర్శి సుమన్ రెడ్డి,వార్డు సభ్యుడు దేవులపల్లి రాజు గ్రామ పెద్దలు గుమ్మడి సమ్మయ్య, మల్లెల బాబు, మల్లె లక్ష్మణ్. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కంగాల రాజు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్డు పనులు ప్రారంభించడం పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily