DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి ఫిబ్రవరి 9 అక్షరం న్యూస్; పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ఐదో వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన గుజ్జుల కుమార్ గెలుపు బాటలో వేగంగా దూసుకెళ్తున్నారు. ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి లభిస్తున్న స్పందన ఆయన విజయావకాశాలను మరింత బలపరుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అండదండలతో, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులతో ఐదో వార్డులోని ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని గుజ్జుల కుమార్ ఓటర్లకు భరోసా ఇస్తున్నారు. ఈ హామీలతో ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. “నన్ను గెలిపిస్తే ఐదో వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తా… ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తా” అంటూ ఇచ్చిన హామీలు ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ఆయన స్పష్టమైన కార్యాచరణను ప్రజల ముందు ఉంచుతున్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా వార్డు ప్రజలు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటూ చెయ్యి గుర్తుకే జై అంటూ నినాదాలు చేస్తున్నారు. గుజ్జుల కుమార్ ప్రచారానికి లభిస్తున్న అనూహ్య స్పందనతో ఐదో వార్డులో కాంగ్రెస్ జోరు మరింత పెరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మరో గెలుపు ఖాయమనే నమ్మకం కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
.
Aksharam Telugu Daily