P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి మార్చి 13 (అక్షరం న్యూస్) రైతులు వేసవి లో దుక్కులు ఎక్కువ లోతు దున్నడం వల్ల చీడపీడల ఉధృతి తగ్గుతుందని సూచించారు ఈ సందర్భంగా ఓదెల మండల కేంద్రంలోనీ రైతు వేదిక లో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) , వ్యవసాయ శాఖ మరియు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (TRVK) కరీంనగర్ ఆధ్వర్యం లో రైతులకు ప్రకృతి వ్యవసాయం, భూసార పరీక్ష ఆధారిత ఎరువుల వినియోగం, బిటి 3 పత్తి విత్తనాల వలన కలిగే నష్టాలు, మరియు ప్రస్తుత సాగు చేస్తున్న పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై రైతులకు RPL ట్రైనింగ్ మరియు సామర్ధ్యం పెంపుదల (కెపాసిటీ బిల్డింగ్) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఓదెల గ్రామ సర్పంచ్ శ్రీ కనికిరెడ్డి సతీష్ పాల్గొని, రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు అధికారుల, శాస్త్రవేత్త ల సలహాలు సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలి అని అన్నారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కరీంనగర్ శాస్త్రవేత్త డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రైతులు భూసార పరీక్షలు చేసుకోవాలి అని. భూసార పరీక్ష ఆధారిత ఎరువుల వేసుకోవాలి అన్నారు. అధిక ఎరువుల వినియోగం వలన చీడ పీడల ఉధృతి ఎక్కువ ఉంటుంది అన్నారు. వేసవి లో లోతు దుక్కులు దున్నడం వలన చీడ పీడల ఉధృతి తక్కువ గా ఉంటుంది అన్నారు. పెద్దపల్లి వ్యవసాయ డివిజన్ ఏడిఏ శ్రీనాథ్ మాట్లాడుతూ రైతులు శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటిస్తూ సాగులో మెలకువ ల తో అధిక దిగుబడులు సాధించాలి అన్నారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి భాస్కర్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు , రైతులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily