DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి | ఫిబ్రవరి 6 (అక్షరం న్యూస్): పెద్దపల్లి పట్టణంలోని 23వ వార్డులో ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ (ఐఎఫ్బి) పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి జడల సురేందర్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కార్యకర్తలు, అనుచరులతో కలిసి ఇంటింటా తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని, మౌలిక వసతుల కల్పనతో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తానని ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. జడల సురేందర్ చేపడుతున్న ప్రచారానికి వార్డులో అనూహ్య స్పందన లభిస్తోందని పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. ఐఎఫ్బి పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ నమ్మకాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి తనయ, బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆశీర్వాదంతో పాటు, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ అండదండలతో 23వ వార్డులోని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని జడల సురేందర్ ఓటర్లకు భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో 23వ వార్డులో ఐఎఫ్బి పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతోందని, పోరు ఆసక్తికరంగా మారుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
.
Aksharam Telugu Daily