GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : చొప్పదండి /కరీంనగర్, ఫిబ్రవరి 08( అక్షరం న్యూస్) చొప్పదండి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ చౌరస్తా వద్ద జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ముఖ్య అతిధి గా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరు అయినారు. చొప్పదండి మున్సిపాలిటీని బీజేపికి అప్పగిస్తే కేంద్రం నిధులతో స్మార్ట్ చొప్పదండిగా మారుస్తానని హామీ ఇచ్చారు. పదేళ్లు అధికారం లో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఏమి అబివృద్ధి చేయలేదని , అలాగే 2 ఏళ్లుగా అధికారం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అబివృద్ధికి దూరంగా ఉందని, బిజెపినీ గెలిపిస్తే తొగురుమామిడి ప్రజలకు ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జిని తనే స్వయంగా తన నిధులతో నిర్మిస్తానని, అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లను, డ్రైనేజీలను పూర్తిచేస్తామని , మినీ ట్యాంక్ బండ్, ప్రభుత్వ స్థలంలో క్రిడల అబివృద్ధికి స్టేడియం నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు చిల్ల శ్రావణ్, మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జ్ సురభి నవీన్ రావు,మాజీ పట్టణ అధ్యక్షులు బత్తిని ప్రశాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి గుండేటి వెంకటరమణ, సీనియర్ నాయకులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, గొల్ల గట్టయ్య, తోట కోటేష్,బిజెపి పార్టీ అభ్యర్థులు పెంచికుల రమాదేవి , చేపూరి హేమ, చిల్ల అర్చన,వడ్లూరి సుధాకర్,పెద్దేలి గీతాంజలి, సార్ల కనకయ్య, గుండేటి అనుదీపిక, రాజన్నల రాజు, దుంప వెంకటేష్, గుర్రం చంద్ర శేఖర్ రెడ్డి,అనుకారి సాయి కృష్ణ , బత్తిని కవిత, జిట్టా మంగ, సంగ లహరిక కార్యకర్తలు నరేష్, కుమార్, శ్రీనివాస్, శివ, కళ్యాణ్ ,రామకృష్ణ ,మల్లేష్, సమర్ ,మహేష్ వేణు, వివిధ వార్థులకి చెందిన బిజెపి పార్టీ ఇన్చార్జులు, ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily