DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఫిబ్రవరి 07 అక్షరం న్యూస్ పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్బంగా 21వ వార్డు నూగిల్ల మల్లయ్యకి మద్దతుగా గడప పడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటు వేసి నూగిళ్ళ మల్లన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లని ఓట్లు అభ్యర్థించారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 21వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నూగిళ్ళ మల్లయ్యను ఈనెల ఫిబ్రవరి 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నూగిళ్ళ మల్లన్న కౌన్సిలర్ గా గెలిస్తే 21వ వార్డు మరింత సుందరంగా మారుతుందని అన్నారు. రాజకీయాల్లో పలు పర్యాయాలు ఓటమెరగని నాయకుడిగా మల్లయ్య ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే పట్టణం సుందరంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily