Saturday, 07 February 2026 06:19:56 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఎన్నికలలో ఒక మాట... గెలిచాక ఒక మాట..! వారికి తెలిసిన బాటే...! అవినీతి కౌన్సిలర్లకు మళ్లీ పట్టం కట్టేనా...! -నూతన నాయకులకు అవకాశం కలిగేనా... ! - ప్రభు

.


Jakkani Rajaramesh , SIRCILLA.

Reporter

Date : 18 January 2026 07:34 PM Views : 114

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : ...! రాజన్న సిరిసిల్ల, జనవరి 18 (అక్షరం న్యూస్): అభివృద్ధి పేరుతో ప్రజలను దోచుకోవాలని చూసే అవినీతి నాయకులకు, ప్రజలను మభ్యపెట్టి డబ్బులు దండుకుని మభ్యపెట్టే నాయకులకు ఎంతో ఆశ కలిగించే మున్సిపల్ ఎన్ని"కల" వచ్చేసింది.. నూతన ఉత్సాహంతో కొత్తగా అవకాశం ఇవ్వాలని ఎదురు చూస్తున్న నాయకులకు పండగ రానే వచ్చింది... కానీ ప్రజలకు మాత్రం ఎవరిని ఎన్నుకోవాలో.. ఎవరు గెలిచిన తర్వాత మనకు సాయం చేస్తారో లేదో..అర్థం కానీ ప్రశ్న...అసలు "నిస్వార్థ సేవకుడు" ఎవరు అనే ప్రశ్న ప్రజల మదిలో నాటుకున్న మాట..ఎన్నికలలో ఒక మాట... గెలిచిన తర్వాత ఒక మాట...వారికి తెలిసిన బాటే ... ప్రభుత్వం మారిన అవినీతి మారుతుందా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. గత ఎన్నికలలో గెలుపు సాధించిన కౌన్సిలర్లు చేసిన అవినీతి గుర్తు చేసుకుంటే ఒక్కొక్కరి రోదనలు ఇంకా వినిపిస్తున్నాయి. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నుకున్న కౌన్సిలర్లు తమ ఇష్టారాజ్యంగా అమాయక, నిరుపేద ప్రజల వద్ద వివిధ పథకాలను అడ్డం పెట్టుకుని డబ్బులు దండిగా దండుకున్నారని ప్రజలందరికీ తెలుసు... గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబల్ బెడ్ రూమ్ పథకం, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి, సీఎం రిలీఫ్ ఫండ్ పథకాలు పేద ప్రజల చేతికి అందాలంటే గత కౌన్సిలర్ల అవినీతి చాటున ఇబ్బందులు తప్పలేదు..అనేది నిజం..ఈ పథకాలను అడ్డం పెట్టుకొని కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు అవినీతికి పాల్పడ్డ వారిపై గత ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు... ప్రజలైన ఈసారి వారిని గుర్తించి తగిన గుణపాఠం చెబుతారో.. లేక ఆర్థిక లబ్ధికి లొంగుతారో వేచి చూడాలి... భూ కబ్జాలు.. అవినీతి వ్యాపారాలు చేసుకుంటూ.. నాయకులు పాలకులు బాగానే పబ్బం గడుపుతూ కాలం గడిపారు. ఇప్పటికైనా ప్రజలను, తమను నమ్మిన ఓటర్లను, మోసం చేయకుండా నీతి నియమాలు, ధర్మత సిద్ధాంతాలు పాటించి తమ వార్డులను అభివృద్ధి చేసుకుంటూ సుపరిపాలన సాగించి అందరి మన్నలను పొందాలని ప్రతివార్డు ప్రజలు కోరుకుంటున్నారు. రోజులు మారాయి.. అవినీతి చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఉంటే ఎవరు చూస్తూ ఉండలేరు... వారిని నిలదీసే హక్కులను కలిగిన ప్రజలు, వార్డులో ఒక్కరైనా ప్రశ్నించే వరకు తెచ్చుకోకూడదని ప్రజలు అనుకుంటున్నారు.. రాష్ట్రంలో యువ నాయకునిగా పేరుగాంచిన కేటీఆర్ కు సిరిసిల్లలో అవినీతి మచ్చ తీసుకువచ్చిన కౌన్సిలర్లకు ప్రజలు చెక్ పెడతారో లేదో వేచి చూడాల్సిందే...!

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :