D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్/ జనవరి 15 (అక్షరం న్యూస్) కొత్తగూడెం పట్టణంలో వికాస తరంగిణి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవముల సందర్భంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం నేత్రపర్వంగా ఆలయ అర్చకుల మంత్రోచ్ఛారణ మధ్య కళ్యాణ తంతును సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా టిపిసిసి జనరల్ సెక్రెటరీ నాగాసీతారాములు, డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ , పురప్రముఖులు డాక్టర్ నాగరాజు ,డాక్టర్ విజయకుమార్, తాటిపల్లి. శంకర్ బాబు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ,అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
..
Aksharam Telugu Daily