Saturday, 22 November 2025 11:10:47 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

గూడూరుపాడు అభివృద్ధికి ₹8.50 కోట్లు మంజూరు.. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, ఆరోగ్య ఉపకేంద్రంతో గ్రామాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం.. అర్హులంద


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 18 November 2025 08:37 PM Views : 76

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ నవంబర్ 18 (అక్షరంన్యూస్) ఖమ్మం రూరల్ : గూడూరుపాడు గ్రామ అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం గత రెండేళ్లలో ₹8 కోట్లు 50 లక్షలు విడుదల చేసిందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడులో పలు అభివృద్ధి పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి మాట్లాడుతూ గూడూరుపాడు–ఆకేరు మార్గానికి ₹1.10 కోట్లు, ఎం.వి.పాలెం–గూడూరుపాడు రహదారి నుండి చెరువు అలుగు వరకు ₹3.30 కోట్లు, గూడూరుపాడు–గొర్లపాడు రహదారికి ₹2.97 కోట్లు మంజూరు చేసి బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ₹35 లక్షలు, ఆరోగ్య ఉపకేంద్రం భవనానికి ₹21 లక్షలు, త్రాగునీటి సదుపాయాలకు ₹7 లక్షలు కేటాయించామని చెప్పారు. “ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గూడూరుపాడు గ్రామ అభివృద్ధి ఏ కోణంలోనూ వెనుకబడకుండా చర్యలు తీసుకున్నాం. గ్రామాభివృద్ధి కోసం మొత్తం ₹8.50 కోట్లు విడుదలయ్యాయి. స్థానికుల డిమాండ్ మేరకు కోల్డ్ స్టోరేజ్ రహదారిని కూడా ఆమోదం తెలుపుతున్నాం” అని మంత్రి పేర్కొన్నారు. “పేదలకు ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన గత పాలకులకు లేదు. అయితే ఇందిరమ్మ ప్రభుత్వం తొలి విడతలోనే 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. గూడూరుపాడులో ఇప్పటికే 17 ఇందిరమ్మ ఇండ్లు ఆమోదం పొందాయి. రాబోయే మూడు విడతల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లను తప్పక అందిస్తాం” అని అన్నారు. “రైతు భరోసా కార్యక్రమం ద్వారా కేవలం 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. సన్న వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు ₹500 బోనస్ అందిస్తున్నాం. రైతును రాజు చేయడం మా ప్రభుత్వ లక్ష్యం” అని తెలిపారు. గురుకులాల్లో 40% డైట్ చార్జీలు, 200% కాస్మొటిక్స్ చార్జీల పెంపు చేపట్టామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల రేషన్ కార్డుల విడుదల జరిగిందని గుర్తుచేశారు. “పేదలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంక్షేమం–అభివృద్ధి అనే రెండు రెక్కలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా” అని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డి, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఆర్డీఓ నరసింహారావు, ఆర్‌అండ్‌బి ఎస్ఈ యాకోబు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :