GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/నవంబర్-10(అక్షరం న్యూస్) ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ను రచించిన అందెశ్రీ (64) కన్నుమూశారు. హైదరాబాద్లోని లాలాగూడలో నివసిస్తున్న ఆయన రాత్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యులు పరిశీలించి ఆసుపత్రికి చేరుకునేలోపే అందెశ్రీ మృతి చెందినట్లు వెల్లడించారు. ఆయన ఇంటి వద్దే మరణించినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అందెశ్రీ జీవితం:1961 జులై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో అందెశ్రీ జన్మించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అందెశ్రీ ముఖ్య పాత్ర పోషించారు. ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిన నింపిన కవి అందెశ్రీ. రాష్ట్ర ఉద్యమంలో ప్రజల నోట మారుమోగిన ‘జయజయహే తెలంగాణ’ గీతంతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ముఖ్యంగా ‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు’ పాటతో అందెశ్రీ ప్రజల్లో అపారమైన గుర్తింపును సంపాదించారు. అందెశ్రీ అసలుపేరు: పాఠశాల విద్య లేనప్పటికీ, కవిగా తనదైన శైలి చూపించి సాహితీ ప్రపంచంలో నిలిచారు. జీవిత ప్రారంభంలో గొర్రెల కాపరిగా పనిచేసి, తరువాత భవన నిర్మాణ కూలీగా చేశారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అందెశ్రీకి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందెశ్రీ అసలుపేరు అందె ఎల్లయ్య
.
Aksharam Telugu Daily