అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల/ గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల/గంభీరావుపేట/ ఏప్రిల్ 29 (అక్షరం న్యూస్) గంభీరావుపేట మండల కేంద్రంలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో కరీంనగర్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ.దేశ సమగ్రతను కాపాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని నేను కేకే మహేందర్ రెడ్డి ఇద్దరం టిఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేశాం.మ ఇద్దరినీ కెసిఆర్ కుటుంబ సభ్యులు నయవంచనకు గురి చేశారు అవసరం ఉన్నంతవరకు ఉపయోగించుకొని చివరికి ఇద్దరినీ బలి పశువులను చేశా పార్లమెంట్ ఎన్నికలు పూర్తవగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ,మహాలక్ష్మి కింద రూ.2500 మహిళలకు,వర్షాకాలంలో వరి రైతులకు రూ.500 బోనస్,ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు,అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు.కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీఎస్టీ ని 12 శాతానికి తగ్గించి సామాన్యులకు నిత్యవసరాలు అందుబాటులోకి తెస్తాం.అని పేదల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమ వుతుందనీ,ఎవరబ్బ సొమ్మని 11 లక్షల కోట్ల ప్రజాధనాన్ని అంబానీ అదానిలకు మోడీ దారదత్తం చేశాడు..కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి పైసా దోచుకున్న వారి కడుపులో నుండి బయటికి కక్కిస్తాం.నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలను తీసిన మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది.20 కోట్ల ఎంపీ డాట్స్ నిధులను మురగబెట్టే బదులు ఇలాంటి మారు మూల ప్రాంతాలను అభివృద్ధిచేయడంచేతకానిదద్దమ్మ.బండిసంజయ్.జోగులాంబ,భద్రాద్రి, రామప్ప ఆలయాలకు బిజెపి ప్రభుత్వం ఒక్కొక్క గుడి అభివృద్ధికి 100 కోట్లు కేటాయించింది.ఇక్కడ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఒక్క టెంపుల్ అభివృద్ధిపైనా దృష్టి పెట్టలేదు.దేవుడి ఫోటో పెట్టుకొని ఓట్లు అడగడానికి సిగ్గనిపించడం లేదా అని మండి పడ్డారు.ఇ కార్యక్రమoలో మండల ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలోపాల్గొన్నారు
.
Aksharam Telugu Daily