అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్ : . సుల్తానాబాద్.(పెద్దపల్లి జిల్లా), ఎప్రిల్29, అక్షరం న్యూస్. సుల్తానాబాద్ మండలం బి.అర్.ఏస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.గత పది సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకుని సేవలందించిన మండల అధ్యక్షులు పురం ప్రేమ్చందర్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీరు నచ్చకనే పార్టి వీడుతున్నట్లు గా ప్రకటించారు. దాసరి మనోహర్ రెడ్డి ఒట్టేందు పోకడలతో కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, దాసరి మనోహర్ రెడ్డి బి అర్.ఏస్,పార్టీని బ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా బి అర్.ఏస్ పార్టీ ఖాలి అవడం ఖాయమని,మండల పరిధిలోని ముఖ్య నాయకులు కూడా త్వరలోనే పార్టీని వీడి కాంగ్రెస్ పార్టి లో చేరనున్నారని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా బి.ఆర్.ఎస్ కు అంకితభావంతో సేవలందించానని, దాసరి మనోహర్ రెడ్డీ కారణంగానే పార్టీ వీడానని ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్ది పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో దాదాపుగా బి అర్.ఏస్.ఖాలీ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. సుల్తానాబాద్ మండల పరిధి లో మరికొంత మంది ముఖ్య నేతలు త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్లు సమాచారం.
.
Aksharam Telugu Daily