అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం /ఏప్రిల్.29/ అక్షరం న్యూస్; మరణించిన పోలీసు అధికారుల కుటుంబ సభ్యుల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకుని,వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తమను సంప్రదించాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హామీ ఇచ్చారు. టేకులపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య కారణాలతో మరణించిన ఏఎస్సై బి.కృష్ణ కుటుంబానికి చేయూత ఫండ్ రూ. 1,00,000/ లక్ష రూపాయలు, కొమరారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య కారణాలతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ఎం. సైదేశ్వరరావు కుటుంబానికి భద్రతా ఎక్స్గ్రేషియా నగదు రూ. 8,00,000 లక్షలు ,కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తు కాలువలో పడి ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ పి.శ్రీదేవి కుటుంబానికి భద్రతా ఎక్స్గ్రేషియా నగదు 8,00,000/- లక్షలు రూపాయలను చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వారికి అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ సూపరింటెండెంట్ సత్యవతి, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ మధు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily