Tuesday, 14 May 2024 02:37:43 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

రామాలయంలో ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం

సీతమ్మ తల్లే గొప్పది...కాదు మా రామయ్యే...

Date : 16 April 2024 08:17 PM Views : 210

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం/ ఏప్రిల్ 16/ అక్షరం న్యూస్ : శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఎదుర్కోలు ఉత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయంలో నిత్య విధి అనంతరం రాత్రి శ్రీరామ చంద్ర మూర్తిని గరుడ వాహనదారునిగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయుద్యాలు, వేద మంత్రాలు, భక్తుల జయ జయ ద్వానాల నడుమ ప్రధాన ఆలయం నుండి ముక్కోటి వైకుంఠ ద్వారం వద్దకు తీసుకుని వచ్చి సీతారాములను ఎదురుదురుగావేంచేపు చేసి ఎదుర్కోలు సన్నాహము ప్రారంభించారు. స్వామి వారి తరపున ఒకరు, అమ్మ వారి తరపున ఒకరు అర్చక స్వాములు సీతారాముల వైభవాన్ని సంభాషణ రూపంగా మనోరంజకంగా నిర్వహించారు. సీతమ్మ తల్లి గొప్పదని ఒకరు ప్రస్తావించగా... కాదు కాదు మా రామయ్య తండ్రే గొప్పవాడు అంటూ రామాయణంలోని పలు ఘట్టాలు ప్రస్తావిస్తూ సాగిన ఈ సంభాషణ భక్తులను ఆకట్టుకుంది. అనంతరం ఎదుర్కోలు నిర్వహించి స్వామి వారికి పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు సమర్పించారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :