అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ... పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 24 అక్షరం న్యూస్; పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో నేపథ్యంలో రామగుండం మాజీ 8 ఇన్ క్లైన్ లో ప్రచారం నిర్వహించి అనంతరం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం నిర్వహించి, మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కొప్పుల మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన కెసిఆర్ ముఖ్యమంత్రి గా కెసిఆర్ అయిన తరువాత దండుగ అన్నా వ్యవసాయాన్ని పండుగ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు అసాధ్యం కాని, హామీలతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనలో చూస్తే మళ్లీ 60 సంవత్సరాలు వెనక్కి పోయినట్లు ఉంది. ఆశ పడటం తప్పు కాదని, మోసం చేయడం తప్పు అది కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు. నమ్మించి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డ్రామా కంపెనీ.. ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అనుకున్నాం కాని, ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందని ఆగస్టు 15 ఇస్తాం అని ముఖ్యమంత్రి గారే దేవుని పై ప్రమాణం చేస్తున్నారు ప్రభుత్వం ఉద్యోగులకు మొదటి తేదీనే జీతం ఇస్తా, అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జీతాలు వేస్తుందో.. ప్రజలు గమనిస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన రైతు బంధు అడిగితే చెప్పు తీసి కొడతా అంటున్న మంత్రులు ముఖ్యమంత్రి గారు, పూర్తిగా స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారు.. ఈ అబద్దాలతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ని గ్రామ గ్రామాల్లో నిలదీసే రోజులు రానున్నాయన్నారు. ఇప్పుడు ప్రజలకు అర్థం అవుతుంది, ఎప్పుడూ బిఆర్ఎస్ పార్టీని ఎందుకు పోగుట్టుకున్నామని బాధపడుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందని కార్యకర్తలు అధైర్య పడవద్దన్నారు. కాళేశ్వరం అంటే కెసిఆర్.. కెసిఆర్ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టు ను కావాలని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. నేను సింగరేణి కార్మికున్ని, కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాన్ని, నేను సాదాసీదా మనిషిని, నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు ఎప్పుడూ ప్రజలతో మమేకమైన ఉండేవాన్ని ఈ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ గెలవచ్చు కాని అది నా గెలుపు కాదు.. మీ అందరి గెలుపు.. ఈ పార్లమెంటరీ పరిధిలో ప్రజల కోసం ఈ గెలుపు కావాలన్నారు.
.
Aksharam Telugu Daily