అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : * మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ ఏ(పిల్ 22(అక్షరం న్యూస్) తెలంగాణ రాష్ట్రంలో గత కొంత కాలం క్రితం సర్పంచుల పదవి కాలం ముగియడంతో అన్ని గ్రామపంచాయతీల లో ప్రత్యేక అధికారులను నియమించారు అనాటి నుండి స్పెషల్ ఆఫీసర్ గా భాధ్యతలు స్వీకరించి న అధికారులకు గ్రామ పంచాయతీ కి సంబంధించిన నిధులన్నిటికి మరియు గ్రామ అభివృద్ధికి సంబంధించిన పూర్తి బాధ్యత గ్రామ కార్యదర్శి స్పెషల్ ఆఫీసర్లదేనని ఉన్నత అధికారులు స్పష్టం చేశారు ఇదిలా ఉండగా మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పరిధిలో ఏజెన్సీ గ్రామ మైన కోమట్లగూడెం గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్ గా గంగారం డిప్యూటీ తహశీల్దార్ పద్మావతి బాధ్యతలు స్వీకరించారు అనాటి నుండి నేటి వరకు కోమట్లగూడెం గ్రామ పంచాయతీ నీ కనీసం ఇంత వరకు సందర్మించలేదని గ్రామ పరిధిలో శానిటైజెషన్ చేయడం లేదని వీధి దీపాలు వెలగడంలేదని తాగునీరు విపరీతంగా ఉందని ఇలాంటి సమస్యలు అనేకంగా ఉన్నాయని వాటిని తక్షణమే పరిష్కరించాలని మా గ్రామ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలిగించోద్దని మీకు మా గ్రామ పంచాయతీ కి రావడం వీలు కాకుంటే మా గ్రామ సెక్రటరీ కి చెప్పి మా సమస్యలను పరిష్కరించాలని సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపు ల్లో గ్రామ స్తులు పెడుతున్నారు అలాగే గత వారం క్రితం కూడా వీధి దీపాల నిధులకు సంబంధించిన గ్రామస్తులు తెలిపారు ప్రత్యేక అధికారి డిప్యూటీ తహశీల్దార్ పద్మావతి కావడం తో గ్రామ సెక్రటరీ అనేక ఇబ్బందులు పెడుతున్నారని మాకు స్పష్టం గా అర్ధం అవుతుందని గ్రామ ప్రజలు కోరారు దయచేసి మా గ్రామ అభివృద్ధికి సహకరించి మా సూచనల మేరకు తీర్మానాలు చేయాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి ఇకనైనా మా గ్రామ స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ తహశీల్దార్ పద్మావతి కోమట్లగూడెం గ్రామ పంచాయతీ ని సందర్మించి గ్రామ సమస్యలను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు
.
Aksharam Telugu Daily