అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం/ మార్చి.25/ అక్షరం న్యూస్; అన్ని దానాల్లోకెళ్లా ఉత్తమమైనది "నీటి" దానం మొహమ్మద్ (స.అ సం) బోధనలు ఆదర్శమని ఖిద్మతే ఇన్సానియత్ వెల్ఫైర్ సొసైటీ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇబ్రహీం మరియు వైస్ ప్రెసిడెంట్ హఫీజ్ జలీల్ అన్నారు. ఎండల వల్ల సామాన్య ప్రజలు మంచినీటి ఎద్దడిని ఎదుర్కోవద్దనే ఉద్దేశ్యంతో ఖిద్మతే ఇన్సానియత్ వెల్ఫైర్ సొసైటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన శాశ్వత చల్లని మంచినీటి కేంద్రాన్ని ప్రభుత్వ డాక్టర్ మెహమూద్ పాషా చేతుల మీద ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ చలివేంద్రం కేవలం ఎండాకాలంలోనే కాకుండా 12నెలలు అంటే శాశ్వతంగా ఇక్కడికి వచ్చే రోగులకు మంచి నీళ్ళు అందించే సేవలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇక ఖిద్మతే ఇన్సానియత్ వెల్ఫైర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్, సిరాజ్, గౌస్ , అబ్దుల్ అజీజ్, ఇమ్రాన్ , ఖదీర్, తదితరులు పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily