అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 27 అక్షరం న్యూస్; కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శని, ఆదివారాల్లో వచ్చే వీకెండ్ హైదరాబాద్ నాయకులని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు గోదావరిఖని లక్ష్మీ నగర్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో వివేక్ వెంకటస్వామిది కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. ఒకే కుటుంబం నుండి మూడు తరాలు ఉన్నారని వల్ల ఆస్తులు కాపాడుకోవడానికే రాజకీయాల్లోకి వస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఎంపీగా పెద్దపల్లి నుండి గెలిచిన వివేక్ కుటుంబం దేశంలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకొని లక్షల కోట్ల రూపాయలను సంపాదించారని అన్నారు. కానీ అధికారంలో ఉన్న సమయంలో పెద్దపల్లిలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని ఇలాంటి నాయకులకు ప్రజలు బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఇచ్చిన హామిలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికుడి బిడ్డగా ఒక్క అవకాశం ఇచ్చి ఆదరించాలని ప్రజలను కొప్పుల ఈశ్వర్ కోరారు.
.
Aksharam Telugu Daily