అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/ఏప్రిల్-15(ఆక్షరం న్యూస్) ముస్తాబాద్ మండల టి ఆర్ ఎస్వీ మండల అధ్యక్షుడు ఎండి నవాజ్ తన జన్మదినం సందర్భంగా పేద పిల్లలకి ఆహారం అందచేసి తన ఉదార స్వభావము చాటుకున్నాడు.ఈ సందర్భంగా నవాజ్ మాట్లాడుతూ మాజీ మంత్రి,బీఆర్ ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు స్ఫూర్తి తో గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా తన వంతుగా తగం ఫౌండేషన్ సహకారంతో ఒక్క పూట ఆహారం పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. పిల్లలు నవాజ్ ఆయురారోగ్యాలతో జీవించాలని పిల్లలు కోరుకున్నారు.హంగు ఆర్భాటాలకు పోకుండా పేద పిల్లల కు ఆహారం అందచిన నవాజ్ కు నెట్టింట్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి అనంతరంముస్తాబాద్ మండల కేంద్రం లో నవాజ్ జన్మదినం సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్ రావు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి బీ ఆర్ ఎస్,పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి ,యూత్ అధ్యక్షుడు శీలం స్వామి, బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు నల్ల నర్సయ్య ,గుండవేని సతీష్ ,పల్లె సత్యం గౌడ్, కంచం నర్సింలు,సోషల్ మీడియా వారియర్ నాని,బీ ఆర్ ఎస్వీ యూత్ ప్రశాంత్ గుణశేఖర్,భాను నవీన్ తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily