అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ● ఎన్నికల అధికారులకు ఫిర్యాదు ● హైదరాబాద్ లో ఎన్నికల ఉన్నత అధికారికి ఫిర్యాదు చేయగా కదిలిన జిల్లా యంత్రాంగం ● ఎమ్మెల్యే కునంనేని పై ఫిర్యాదు చేసిన ఎంపిడిఓ ఐపీసీ 188, 171సి ఐపీసీ కేసు నమోదు చేసిన పాల్వంచ రూరల్ యస్ ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏప్రిల్.16 అక్షరం న్యూస్ ; కొత్తగూడెం ఎమ్మెల్యే కునంనేని పై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద కేసు నమోదైంది.తెలంగాణ లో లోక్ సభ ఎన్నికలకు గత నెల 16వ తేదీ నుండి ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే .ఎన్నికల కోడ్ ఉల్లంఘించి సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,న్యాయవాది యెర్రా కామేష్ పలుమార్లు జిల్లా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో హైదరాబాద్ లోని రాష్ట్ర ఎన్నికల చీఫ్ సెక్రెటరీ కి ఫిర్యాదు చేయడంతో తక్షణం విచారణకు ఆదేశించిన అధికారి ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పాల్వంచ ఎంపిడివో ఎలాంటి అనుమతులు లేకుండా పాల్వంచ మండలంలోని తొగ్గుడెం పంచాయతీ మరియు జగన్నాధ పురం పంచాయతీలో 23.03.2024న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఎలాంటి అనుమతులు లేకుండా టెంటు వేసి ప్రజలతో సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొంటూ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు పై ఎన్నిక కోడ్ ఉల్లంఘన కింద పిర్యాదు చేసిన ఎంపిడిఓ . పాల్వంచ రూరల్ పోలీస్ వారు ఐపీసీ 188 మరియు 171సి సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది.
.
Aksharam Telugu Daily