అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్ధిపేట/బెజ్జంకి : బెజ్జంకి/సిద్దిపేట,ఏప్రిల్04(అక్షరం న్యూస్): మండలంలోని వడ్లుర్ బేగంపేట్ జజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సును ఏఎస్సై శంకర్ రావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని గుర్తు తెలియని వ్యక్తులు మొబైల్ కు ఏదైనా లింకు పంపిస్తే ఓపెన్ చేయవద్దని ఓపెన్ చేసి డబ్బులు పంపించి మోసపోవద్దని తెలిపారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే జాతీయ సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపికృష్ణ, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, విద్యా కమిటి చైర్మెన్ శంకర్, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily