అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హన్మకొండ/భీమదేవరపల్లి : హనుమకొండ/భీమదేవరపల్లి/ఏప్రిల్ 20 (అక్షరం న్యూస్): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మేజర్ గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారిగా ఎంపీడీవో నాగంపల్లి వీరేశం శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో వీరేశంకు, ఎంపీటీసీలు అప్పని పద్మ, బొల్లంపల్లి రమేష్ లు శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ ప్రత్యేకాధికారిగా పనిచేసిన డి ఎల్ పి ఓ బనావత్ సుదర్శన్ ఎలక్షన్ విధుల్లో భాగంగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జంగం పూర్ణచందర్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily