అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/ఏప్రిల్ 1/అక్షరం న్యూస్: ఈ సంవత్సరపు బొగ్గు ఉత్పత్తి.లక్ష్యం 70.మిలియన్ టన్నులు సాధించటం తో పాటు అదే స్థాయిలో 700 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి రికార్డు సృష్టించిన సందర్బంగా గౌరవ సి అండ్ ఎండి.ఎన్.బలరాం ఐ ఆర్ఎస్ ని అధికారుల సంఘము హైదరాబాద్ ఆఫీసులో సోమవారం కలసి అభినందించారు. ఈ కార్యక్రమంలో అధికారుల సంఘము అధ్యక్షుడు టి.లక్ష్మీ పతి గౌడ్.,పి.నర్సింహులు జనరల్ సెక్రెటరీ,.పోనుగోటి శ్రీనివాస్,వైస్ ప్రసిడెంట్,కిరణ్ రాజ్ కుమార్ జాయింట్ సెక్రటరీ.,అదికారులు పి.మోహన రావు,డా.విష్ణు,.మదార్ లు, హైదరాబాద్ ఆఫీసులో కలిసి అభినందనలు తెలిపారు.అలాగే సంస్థ డెరెక్టర్లు డి.సత్యనారాయణ,డైరెక్టర్(ఈ అండ్ యం),ఎన్.వి.కె శ్రీనివాస్, డైరెక్టర్(పా& ఆపరేషన్స్).,జి.వెంకటేశ్వర్ రెడ్డి (పి.పి) ని,ఆల్విన్.ఇ.డి.(కోల్ మూవ్ మెంట్) ని కలసి అభినందించారు. ఈ సందర్భంగా అధికారులకు సంబందించిన సమస్యలు సీ అండ్ ఎండి దృష్టి కి తీసుకొని వెళ్లగా లాప్ టాప్.లు ఇవ్వటం తో పాటు,ఐఐటి/ఐఐఎం ఫీజ్ రీ యింబర్స్ మెంట్,వర్తింపచేయాలని.చేయాలని ఆదేశించారు.
.
Aksharam Telugu Daily