అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ఓదెల/ పెద్దపల్లి ఏప్రిల్ 28 (అక్షరం న్యూస్) ఓదెల మండలoలొని గుడ్ల్లపల్లి గ్రామము నుండి ఎంపి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున అదివారం ఇంటి ఇంటి ప్రచారం చేపటినా ఓదెల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీఅభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు సందర్భంగా ప్రేమ్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో హామీ ఇచ్చిన గ్యారంటీ పథకాలను చిత్త శుద్ధితో అమలు చేస్తుందని ఈ పార్లమెంటు ఎన్నికలలో శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మన కోసం 5 న్యాయ గ్యారంటీలను ప్రవేశపెట్టారని వాటిని కూడా కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా అమలు చేస్తుంది అని అన్నారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గాని, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతితో, అధిక ధరలతో మరియు నిరుద్యోగంతో ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. మన పెద్దపల్లి నియోజకవర్గంలో మరియు పార్లమెంటు పరిధిలో గడ్డం వంశీ కృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరి కోరారు. మళ్ళీ తిరిగి సంతోష వంతమైన ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మే 13 వ తేదీన హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో రైతులందరిని తరుగు, తాలు పేరిట నట్టేట ముంచారని కానీ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తరుగు పేరిట నిలువు దోపిడీ అనేది లేకుండా, వడ్ల కటింగ్ లేకుండా రైతులందరికీ మేలు చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. బి.ఆర్.ఎస్ మరియు బిజెపి పార్టీల వారికి ప్రజలందరూ మే 13వ తేదిన ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి. సింగిల్ గుండా చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి పిట్టల రవికుమార్ కందుల సదాశివ్ ముప్పాల శంకర్ చొప్పరి రాజయ్య రఫీ పల్లె రాజయ్య తో పాటు నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily