అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 19 అక్షరం న్యూస్; తాను ఈ ప్రాంత వాసిని అని ఇక్కడి ప్రజలతో దశాబ్దాల అనుబంధం ఉందని తనను ఎంపిక గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని పెద్దపల్లి పార్లమెంటు టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థించారు. పెద్దపల్లి నియోజకవర్గం లో పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి తరఫున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం నామినేషన్ దాఖలాలు చేశారు. కొప్పుల ఈశ్వర్ నామినేషన్ సందర్భంగా పెద్దపల్లిలోని అంబేద్కర్ చౌరస్తాలో భారీ రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో వలస నాయకులు పోటీ చేసి గెలుపొందడంతోపటు సొంత ప్రయోజనాలు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలుపొందిన నాయకులు ఆ తర్వాత ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధి కార్యక్రమాలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. స్థానికుడైన తనకు ఈ పార్లమెంటుతో ఎంతో అనుబంధం ఉందని తనని గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉండి మంచి చెడ్డలు చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. కుటుంబ పాలనను విమర్శించిన కాంగ్రెస్ నాయకులు అదే బాటను అనుసరిస్తున్నారని గడ్డం వెంకటస్వామి కుటుంబానికి చెందిన ముగ్గురికి ఆ పార్టీ అవకాశం కల్పించడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ , పెద్దపల్లి జెడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధుకర్ , మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు, సుమన్, చిన్నయ్య, దివాకర్ రావు, పెద్దపల్లి నియోజకవర్గం నాయకురాలు దాసరి ఉష , మాజీ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, గంట రాములు కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష గారు మాట్లాడుతూ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకి, ప్రజల కి. భద్రత లేకుంట పోయింది అని ఇచ్చిన హామీలన్నీ దొంగ హామీలు అని అన్నారు. మహిళలకి ప్రజలకి భద్రత కావాలంటే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపు దిశగా అడుగులు ముందుకు వేయాలని ప్రతి ఇంటికి గడుప పడుపాకి వెళ్లి ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి మన కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించికుందమని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily