అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ● భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం/ ఏప్రిల్.29/ అక్షరం న్యూస్; ప్రిసైడింగ్ అధికారులకు ఈవీఎంలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల అన్నారు. కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం లో ఉన్న ఈవీఎం గోడౌను పరిశీలించిన ఎన్నికల అధికారి ఎన్నికల సిబ్బంది శిక్షణలో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ఈవీఎంలు, వివి ప్యాడ్స్ ను కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ,ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికలలో విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల(ఈవీఎం)పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సిబ్బంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ల గురించి తెలుసుకోవాలన్నారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్, కౌంటింగ్ వంటి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కలిగి, శిక్షణ సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికల విధుల్లో పొరపాట్లు జరిగితే చర్యలు తీవ్రస్థాయిలో ఉంటాయన్నారు. ఈవీఏంలు, వీవీప్యాట్లపై సిబ్బందికి పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఏదేని సమస్య తలెత్తిన యెడల తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి అవగాహన అవసరమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డిఓ మధు, తాసిల్దార్ పుల్లయ్య, ఎలక్షన్ సెల్ డిప్యూటీ తాసిల్దార్ రంగ ప్రసాద్, ఎలక్షన్ సెల్ సహాయక సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily