Thursday, 16 May 2024 05:19:43 PM
 Breaking
     -> భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అహ్లె సున్నతుల్ జమాత్ జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ కరీం ..      -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..

ప్రిసైడింగ్ అధికారులకు ఈవీఎంలపై అవగాహన కలిగి ఉండాలి

ఎన్నికల విధుల్లో పొరపాట్లు జరిగితే చర్యలు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ : ప్రియాంక అల

Date : 29 April 2024 07:46 PM Views : 61

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ● భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం/ ఏప్రిల్.29/ అక్షరం న్యూస్; ప్రిసైడింగ్ అధికారులకు ఈవీఎంలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల అన్నారు. కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం లో ఉన్న ఈవీఎం గోడౌను పరిశీలించిన ఎన్నికల అధికారి ఎన్నికల సిబ్బంది శిక్షణలో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ఈవీఎంలు, వివి ప్యాడ్స్ ను కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ,ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికలలో విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్ల(ఈవీఎం)పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సిబ్బంది ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌, కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌, వీవీ ప్యాట్ల గురించి తెలుసుకోవాలన్నారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్‌, కౌంటింగ్‌ వంటి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కలిగి, శిక్షణ సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికల విధుల్లో పొరపాట్లు జరిగితే చర్యలు తీవ్రస్థాయిలో ఉంటాయన్నారు. ఈవీఏంలు, వీవీప్యాట్‌లపై సిబ్బందికి పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఏదేని సమస్య తలెత్తిన యెడల తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి అవగాహన అవసరమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డిఓ మధు, తాసిల్దార్ పుల్లయ్య, ఎలక్షన్ సెల్ డిప్యూటీ తాసిల్దార్ రంగ ప్రసాద్, ఎలక్షన్ సెల్ సహాయక సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :