అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జనగామ/బచ్చన్నపేట : - ... బచ్చన్నపేట/ఏప్రిల్6/అక్షరం న్యూస్: బచ్చన్నపేట మండలంలోని పడమటి కేశవపూర్ గ్రామానికి చెందిన రైతు కొమ్మాట రఘుపతి ఆత్మహత్యకు కారణమైన రెవెన్యూ అధికారులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. బచ్చన్నపేట ఎస్సై సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పడమటి కేశవపూర్ గ్రామానికి చెందిన రైతు రఘుపతికి భూమి పట్టా చేస్తా అంటూ అతని దగ్గర రూ. 4.50 లక్షల నగదు తీసుకొని చివరకు తమకు పట్టా కాదని చేతులెత్తేశారు. దీంతో మనస్తాపం చెందిన రఘుపతి చెట్టుకురేసుకుని ఇటీవల ఆత్మహత్యకు చేసుకున్నాడని తెలిపారు. అతని మృతికి కారణమైన రెవెన్యూ అధికారులు సర్వేయర్ కుక్క రవీందర్ అరెస్టు చేసి కోర్టు లో హాజరుపరచగా మెజిస్ట్రేటివ్ రిమాండ్ విధించారని తెలిపారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన సీనియర్ అసిస్టెంట్ కొలిపాక సుమన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు ముమ్మారంగా చేపట్టామని అన్నారు.
.
Aksharam Telugu Daily