అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/రామగిరి : రామగిరి (పెద్దపల్లి జిల్లా) ఏప్రిల్ 14 అక్షరం న్యూస్:: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాలతో గుండారం రిజర్వాయర్ లోకి మరియు ఎల్31 కు సాగునీరు విడుదల చేయడం జరిగిందని కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు గుండారం తాజా మాజీ సర్పంచ్ ఆకుల ఓదెలు తెలిపారు. ఆదివారం రంగాపూర్ వద్ద డి 83 ప్రధాన కెనాల్ తో పాటు ఎల్ 31 కెనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం శ్రీధర్ బాబు మంథని వచ్చిన సందర్భంగా సాగునీరు విడుదల కోసం గుండారం తాజా మాజీ సర్పంచ్ ఆకుల ఓదెలు మరియు వైనాల రాజు మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఇరిగేషన్ అధికారులకు ఫోన్ ద్వారా వెంటనే నీరు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు నీరు విడుదల చేశారు. ప్రస్తుతం సాగునీరు గుండారం రిజర్వాయర్ లోకి చేరుతుంది. దీంతో రైతులు మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
.
Aksharam Telugu Daily