Tuesday, 14 May 2024 06:25:33 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనదారులపై చీటింగ్ కేసులు నమోదు

నేరాల నియంత్రణకు పోలీసు వారు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలి : డిఎస్పీ రెహమాన్

Date : 29 March 2024 03:32 PM Views : 412

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ● భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం/ మార్చి.29/ అక్షరం న్యూస్; నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనదారులపై చీటింగ్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని కొత్తగూడెం పట్టణ డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలను సీజ్ చేసి అట్టి వాహనదారులపై చీటింగ్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఈరోజు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ఒక ప్రకటనను విడుదల చేశారు. కొత్తగూడెం వన్టౌన్, టూటౌన్ మరియు ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై ఈ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన ఇద్దరిపై, కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురిపై చీటింగ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లకు పాల్పడే నేరస్తులు నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను ఉపయోగిస్తున్నారని, అట్టి నేరాల నియంత్రణ, చేధన కొరకు ఈ విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. కొత్తగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంతాలలో నెంబర్ ప్లేట్లు లేకుండా గానీ, నెంబర్ ప్లేట్లు టాంపర్ చేసి గానీ ఎవరైనా పట్టుబడితే వారిపై చీటింగ్ కేసులను నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. నేరాల నియంత్రణకు పోలీసు వారు చేపడుతున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం వన్ టౌన్ సిఐ కరుణాకర్, 3టౌన్ సీఐ శివప్రసాద్, ట్రాఫిక్ ఎస్సైలు నరేష్, మదార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :