అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం /ఏప్రిల్ 24/ అక్షరం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో భద్రాచలం మైనార్టీ గురుకులం కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకు మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారని కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ లాల్ హట్కర్ తెలిపారు. ఇంటర్ రెండవ సంవత్సరం లో హెచ్ ఈ సి మరియు సి ఈ సి నుండి 19 కి గాను 18 ఉత్తీర్ణులయ్యారని, మొదటి సంవత్సరం లో హెచ్ ఈ సి మరియు సి ఈ సి నుండి 27 కు గాను 26 ఉత్తీర్ణులయ్యారని తెలిపారు, ఇందులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం నందు విద్యార్థులు 1000కి గాను 940, 898, 890, 881, 876, 872, 857 మార్కులు సాధించారని, ప్రథమ సంవత్సరం నుండి 500కు గాను 450,444, 433, 432, 429, 428, 419 మార్కులు సాధించారని, వీరియందు 70 శాతం విద్యార్థులు ఏ గ్రేడ్ మరియు మిగతా వారు బి గ్రేడ్ సాధించారని తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ప్రణాళికా బద్దంగా, ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ పరీక్షలకు సన్నద్ధం చేయడం వల్లనే మారుమూల గ్రామాలనుండి వచ్చిన అతి సాధారణ విద్యార్థులచే ఇంగ్లీష్ మీడియం లో రాష్ట్రస్థాయి ఫలితాలు సాధించగలిగామని తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతు విద్యతో పాటు, చక్కని ఆహారం, క్రీడలు, ఇతర మనోవికాసానికి చెందిన కార్యక్రమాలు, ఇంటర్ తర్వాత ఉన్నత చదువులు కోసం కేంద్ర స్థాయి విశ్వవిద్యాలయాల్లో ఎల్.ఎల్.బి, సి ఎ, సీఎంఏ, సి యు ఈ టి వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ సదుపాయాలను పేద మైనారిటీ మరియు మైనార్టీయేతర విద్యార్థులు ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రిన్సిపాల్ కోరినారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించి, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం హెచ్ ఈ సి మరియు సి ఈ సి నందు వచ్చే విద్యాసంవత్సరానికి గాను అడ్మిషన్లు జరుగుతున్నవని, అడ్మిషన్ల కొరకు 9490365635, 9703072559 నంబర్లకు సంప్రదించగలరని కోరారు.
.
Aksharam Telugu Daily