అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : .. గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/మార్చి 23/అక్షరం న్యూస్: కార్మికుల కష్టాలు తెలిసినవడను... మీ అందరికి నేను ఒకడిని రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో తనను ఆదరించాలని ఎంపిగా గెలిపించాలని బీ.ఆర్.ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్మికులను కోరారు. శనివారం 11 ఏ ఇంక్లైన్లో కార్మికులను కలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సింగరేణి కార్మికునిగా పని చేశానని సింగరేణి కార్మికులు అంటే తనకు ఎంతో అభిమానం అని మీలో ఒకనిగా తనును ఆదరించి ఎంపీగా అవకాశం ఇవ్వాలన్నారు. సింగరేణి అభివృద్ధి కోసం కార్మికుల శ్రేయస్సు కోసం ఆర్నిశలు పాటుపడతానని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కార్మికుల బాధలు కష్టాలు నష్టాలను స్వయంగా చూశానని తనకు సింగరేణి కార్మికుల శ్రమ దోపిడీ ఏ విధంగా ఉంటుందో తెలుసు అని ఒక కార్మికునిగా మీలో ఒకనిగా మీ తమ్ముని వలె అన్న వలె కొడుకు వలే భావించి తనకు అవకాశం కల్పిస్తే సింగరేణి కార్మికుల హక్కుల సాధనె లక్ష్యంగా పనిచేస్తానని ఢిల్లీ లెవెల్ లో సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ దిశగా వెళ్లకుండా కాపాడుకుంటానని కార్మికులకు హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులు కొంతమంది అవకాశవాదులు వచ్చి ఏదో చెప్తారని వారిని నమ్మి మోసపోవద్దని ఒక ఇంటి బిడ్డగా తమకు అవకాశం కల్పించాలని కొప్పుల ఈశ్వర్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల కోసం తాను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో సమస్యలు పరిష్కారం చేశానన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సింగరేణి కార్మికులను బార్డర్లో సైనికులు లాగా గుర్తించి సింగరేణి కార్మికుల శ్రేయస్సు కోసం అహర్నిశలు పనిచేశారని చందర్ గుర్తు చేశారు కొప్పుల ఈశ్వర్ కి అవకాశం కల్పించి ఎంపీగా గెలిపించుకోవాల్సిన అవసరం సింగరేణి కార్మికులపై ఉందని కోరుకంటి చందర్ కార్మికులను కోరారు.
.
Aksharam Telugu Daily