అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ ఏప్రిల్ 23--స్వప్తి శ్రీ చాంద్రమానేని శ్రీ కోద్రీ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత రుతువు చైత్రమాసం సశుక్ల పక్ష పూర్ణిమ తిథి భౌమ వానరం జయ (మంగళ) వారం శ్రీమత్ ఉత్తరాది హనుమత్ జయంతి సందర్భంగా మండలంలోని హిందూ సనాతన దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో అన్ని దేవాలయాల ఉత్సవమూర్తులను 24 మంది శాస్త్రి వాయిద్య కళాకారులు సన్నాయి మేళ తాళాలతో తేగడ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం నుండి భారీ ఊరేగింపుగా బయలుదేరి మండలంలోని 30 దేవాలయాల ఉత్సవమూర్తులను సమన్వయం చేసుకుంటూ రైస్ పేట శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద నుంచి గ్రామంలోని ప్రముఖ దేవాలయాలను కలుపుకుంటూ పుర వీధుల గుండా శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం వరకు భారీ శోభాయాత్ర ను ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్ర లో ఆశుకోళ్ళ సాంబయ్య ( నరసరావుపేట గుంటూరు) బృందం వారిచే శోభాయాత్రకు వన్నె తెచ్చే విధంగా నాట్యములతో నృత్య ప్రదర్శనను నిర్వహించారు. ఆరేపల్లి అంజి (చీరవెల్ల) వారిచే విశేష వాయిద్య ప్రదర్శన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని నాయకుల కొత్తూరు వారిచే చిడతల చెక్క భజనలతో శివ్వారపు వీర భోగ చారి ఈశ్వరమ్మ దంపతుల సారథ్యంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
.
Aksharam Telugu Daily