అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/మార్చి 24/అక్షరం న్యూస్: రంగుల పండుగ హోలీని సింగరేణి ఉద్యోగులు,వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకోవాలని సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ ఎండీ ఎన్.బలరామ్ అన్నారు.సింగరేణి ఉద్యోగులందరికీ ఆదివారం హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ అందరి జీవితాల్లోనూ ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు.అలాగే మనకు పర్యావరణా నికి హాని కలిగించే రసాయనిక రంగులు కాకుండా సహజ సిద్ధమైన రంగులతో పండుగనుఆనందోత్సాహా లతో జరుపుకోవాలని సూచించారు.
.
Aksharam Telugu Daily