అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : - చొప్పదండి/ కరీంనగర్,ఏప్రిల్ 24 (అక్షరం న్యూస్ ) కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణం లోని శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్ జరిగిన బీజేపీ సమావేశం లో కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు మంద శ్రీరామ్ బీజేపీ లో చేరారు. మంద శ్రీరామ్ తో పాటు 15 మంది యువకులు, మహిళలు కూడా బీజేపీ లో చేరారు. ఈ సందర్బంగా బీజేపీ లో చేరిన మంద శ్రీరామ్ మాట్లాడుతూ బీజేపీ పట్ల, దేశ రక్షణ లో ప్రధాని మోడీ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు నచ్చి, అలాగే మోడీ ప్రధాని అయిన తర్వాతనే భారత దేశం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ముందుకు పోతుందని, ఇవన్నీ నచ్చి బీజేపీ పట్ల ఆకర్షతులమై తను, తనతో పాటు యువకులు, మహిళలు అందరమూ బారతీయ జనతా పార్టీ లో చేరామని అన్నారు . అలాగే రాబోయే రోజుల్లో తన వంతుగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కి కృషి చేస్తానని అన్నారు. ఈ యొక్క కార్యక్రమం లో అధిక సంఖ్య లో యువకులు, మహిళలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily