అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వికారాబాద్ : వికారాబాద్ జిల్లా/మర్పల్లి/ఏప్రిల్ 18/అక్షరం:-మర్పల్లి మండల పరిధిలోని ఘనాపురం గ్రామంలో చేవెళ్ల పార్లమెంట్ బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కొరకు కృషి బిజెపి మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో గురువారం ఘనాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది .ఇట్టి కార్యక్రమాన్ని మర్పల్లి మండల బిజెపి అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారి గెలుపు ఖాయమని భారీ మెజారిటీ వస్తుందని ఆయన పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల ప్రధాన కార్యదర్శులు ఎర్రోళ్ల లక్ష్మణ్ , శ్రీధర్ రెడ్డి, రాజేష్, దామస్తాపూర్ మాజీ సర్పంచ్ యాదవ రెడ్డి , మహిళా మోర్చా అధ్యక్షురాలు అన్నపూర్ణ , శ్రీనివాస్ రెడ్డి ,శ్రీకాంత్ ,ఘనాపూర్ బూత్ కమిటీ రాము, శేఖర్, కోశాధికారి జగన్నాథం ,కృష్ణ ,అంజయ్య గ్రామస్తులు బిజెపి కార్యకర్తలు తదిరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily