Tuesday, 14 May 2024 03:40:34 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

రామగుండం పోలీస్ కమీషనరేట్ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభించిన

.

Date : 02 April 2024 02:03 PM Views : 334

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : సీపీ. ఎం శ్రీనివాస్ ఐపీఎస్ గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/ఏప్రిల్ 2/అక్షరం న్యూస్: సైబర్‌ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుల వెలుసుబాటు కోసం బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రామగుండం కమిషనరేట్‌లోనే ప్రత్యేక సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం రామగుండం కమీషనరేట్ లో రామగుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు,బాధితులకు సత్వర సేవలు అందించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరిగింది అని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పర్యవేక్షక అధికారిగా ఏసీపీ వెంకటరమణ, ఇన్‌స్పెక్టర్ కృష్ణ మూర్తి,01 హెచ్‌సీలు, 07 మంది కానిస్టేబుళ్లు ఉంటారు.ఈ బృందం సైబర్ బాధితులకు సత్వర సహాయం అందించడం,సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేయడం,దర్యాప్తు చేయడం నేరస్థులను అరెస్టు చేయడం జరుగుతుంది అన్నారు.ఈ స్టేషన్‌లో రూ.లక్ష నుంచి అంతకన్నా ఎక్కువగా సైబర్‌ నేరాలకు గురైతే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది. బాధితులు చేసిన ఫిర్యాదుపై ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేస్తామని, రూ.లక్ష కన్నా తక్కువగా ఉన్న సైబర్‌ నేరాలపై బాధితులు సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లోనే ఫిర్యాదు చేయవచ్చని సైబర్‌ క్రైమ్‌ సీపీ తెలిపారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే బాధితులు 1930కి కాల్‌ చేయడం లేదా www.cybercrime. gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయొచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్స్, సైబర్ పిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :