అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రంగారెడ్డి/ రాజేంద్రనగర్ : రంగారెడ్డి / రాజేంద్రనగర్ / గండిపేట్ / ఏప్రిల్ 06/ అక్షరం న్యూస్ : బీఆర్ఎస్ పార్టీకి సామ ఇంద్రపాల్రెడ్డి రాజీనామా చేశారు. పార్టీపై వస్తున్నఆరోపణల దృష్ట్యా పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈమేరకు ఆయన రాజీనామాను బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కషన్ రెడ్డి కి అందజేస్తానన్నారు. రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని ఉప్పర్ పల్లి ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రపాల్ మాట్లాడుతూ 2018లో బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగిందన్నారు. 2018 నుంచి 2024 వరకు అందరినీ కలుపుకునిపోతూ పార్టీ బలోపేతానికి కృషిచేశానన్నారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గెలుపు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గెలుపుకు కృషిచేసినట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గత 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో వుండి ప్రజలకు సేవ చేయడం జరిగిందన్నారు. 25 సంవత్సరాలుగా ఇంద్రారెడ్డి వారి కుటుంబంలో ఒకడిగా ఉన్నాను ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ని సబితా ఇంద్రారెడ్డి ని విడడం బాధగా ఉందానారు. ప్రస్తుతం గత ప్రభుత్వం కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దీంతో ప్రజల్లోకి వెళ్లడానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని తెలిపారు. త్వరలోనే అనుచరులతో గ్రామస్తులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. మా గ్రామని ఏ పార్టీ అయితే అభివృద్ధి చేస్తుందో ఆ పార్టీకి సహకరిస్తాం అన్నారు. రాజకీయాల్లో ఉన్నాలేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. రేసు నర్సింహా రెడ్డి, వై మోహన్ రెడ్డి , దయానంద్ గౌడ్ , పింజార్ల సుమన్ , అయ్యాడపు భూపాల్ రెడ్డి బి ఆర్ ఎస్ పార్టీని వీడిన వారిలో ఉన్నారు.
.
Aksharam Telugu Daily