Tuesday, 14 May 2024 06:43:39 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

బ్రేకింగ్ న్యూస్

బిఆర్ఎస్ పార్టీపై వస్తున్న ఆరోపణ నేపథ్యంలోనే పార్టీని వీడుతున్న : సామ ఇంద్ర‌పాల్‌రెడ్డి బీఆర్ఎస్ ను వీడిన సామ ఇంద్ర‌పాల్‌ రెడ్డి

Date : 07 April 2024 08:10 AM Views : 124

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రంగారెడ్డి/ రాజేంద్రనగర్ : రంగారెడ్డి / రాజేంద్రనగర్ / గండిపేట్ / ఏప్రిల్ 06/ అక్షరం న్యూస్ : బీఆర్ఎస్ పార్టీకి సామ ఇంద్ర‌పాల్‌రెడ్డి రాజీనామా చేశారు. పార్టీపై వ‌స్తున్నఆరోప‌ణ‌ల దృష్ట్యా పార్టీని వీడుతున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈమేర‌కు ఆయ‌న రాజీనామాను బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్య‌క్షులు మంచిరెడ్డి కషన్ రెడ్డి కి అందజేస్తానన్నారు. రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని ఉప్పర్ పల్లి ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఇంద్ర‌పాల్ మాట్లాడుతూ 2018లో బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగిందన్నారు. 2018 నుంచి 2024 వ‌ర‌కు అంద‌రినీ క‌లుపుకునిపోతూ పార్టీ బ‌లోపేతానికి కృషిచేశాన‌న్నారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గెలుపు, ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్ గెలుపుకు కృషిచేసిన‌ట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గత 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో వుండి ప్రజలకు సేవ చేయడం జరిగిందన్నారు. 25 సంవత్సరాలుగా ఇంద్రారెడ్డి వారి కుటుంబంలో ఒకడిగా ఉన్నాను ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ని సబితా ఇంద్రారెడ్డి ని విడడం బాధగా ఉందానారు. ప్ర‌స్తుతం గ‌త ప్ర‌భుత్వం కుంభ‌కోణాల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ట్లు తెలిపారు. దీంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డానికి అడ్డంకులు ఏర్ప‌డుతున్నాయ‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే అనుచ‌రుల‌తో గ్రామస్తులతో చ‌ర్చించి భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తాన‌ని తెలిపారు. మా గ్రామని ఏ పార్టీ అయితే అభివృద్ధి చేస్తుందో ఆ పార్టీకి సహకరిస్తాం అన్నారు. రాజ‌కీయాల్లో ఉన్నాలేకున్నా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. రేసు నర్సింహా రెడ్డి, వై మోహన్ రెడ్డి , దయానంద్ గౌడ్ , పింజార్ల సుమన్ , అయ్యాడపు భూపాల్ రెడ్డి బి ఆర్ ఎస్ పార్టీని వీడిన వారిలో ఉన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :