అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వికారాబాద్ : వికారాబాద్ జిల్లా/మర్పల్లి/మార్చి 25/అక్షరం న్యూస్:-మర్పల్లి గ్రామాలలో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు.తరతరాలుగా వస్తున్న పండుగలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని మర్పల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ సంతోషం వ్యక్తం చేశారు.ఈరోజు హోలీ పండుగ సందర్భంగా మర్పల్లి మండలం బూచన్ పల్లి గ్రామంలో గ్రామ యువకులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. బూచన్ పల్లి గ్రామంలో ఈ గంగాధర బక్కప్ప ప్రభు జాతరను గత సంవత్సరాలుగా జాతర జరుగుతుందని అందులో భాగంగా వచ్చే అమావాస్య వరకు జాతర ఉత్సవాలు జరుపుకోవడానికి గ్రామ పెద్దలు నిర్ణయించి రథాన్ని గ్రామంలోనికి తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కే. శ్రీనివాస్ రెడ్డి ఎల్. ప్రభాకర్ రెడ్డి బి.బిచ్చిరెడ్డి బూరుగుపల్లి బక్కారెడ్డి ఆకుల రాములు బూచనేల్లి రవీందర్ రెడ్డి, చాకలి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ యువకులు తదితరులు ఉన్నారు
-
Aksharam Telugu Daily