అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : " ● ఖమ్మం జిల్లా/ జడ్పి సెంటర్ /మార్చి.28/ అక్షరం న్యూస్; ఖమ్మం నగరంలోని పల్స్ ఆసుపత్రిలో పదకొండేళ్ల చిన్నారికి అరుదైన ఆపరేషన్ నిర్వహించారు ఆసుపత్రి వైద్యులు. బాలిక కడుపులో నెలల తరబడి పేరుకుపోయిన సుమారు 25 సెంటీ మీటర్ల పొడవు, 10 సెంటీ మీటర్ల వెడల్పుతో జీర్ణాశయానికి అడ్డుగా ఉన్న వెంట్రుకలను తొలగించారు. ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అన్వర్ తెలపిన వివరాల మేరకు. 11 ఏళ్ల అమ్మాయి శరణీ గత కొన్ని నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. పలు ఆసుపత్రులు తిరిగి చికిత్స తీసుకుంటున్నా.. నొప్పి మాత్రం తగ్గడం లేదని, దీంతో ఆ పాప తల్లిదండ్రులు తమ ఆసుపత్రికి రాగా తాము క్షుణ్ణంగా పరీక్షించి పాప వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. అప్పుడప్పుడు పాప వెంట్రుకలు నోట్లో పెట్టుకుని నమలడం చూశామని చెప్పడంతో. పరీక్షలు నిర్వహించగా జీర్ణకోశంలో వెంట్రుకలు అడ్డుందని గుర్తించడం జరిగిందని ,వెంటనే తమ సహచర వైద్యుడు డాక్టర్ ఆనంద్ గౌడ్ పాప తల్లిదండ్రులకు పరిస్థితి వివరించి ఆపరేషన్ చేసి పాప కడుపులో దాదాపు 25సెంటిమిటర్ల పొడవు 10 సెంటిమిటర్ల వెడల్పు చొప్పున వెంట్రుకలు చుట్టుకుని ఆహారాన్ని లోనికి పోనీయకుండా.. అడ్డుగా ఉన్న వెంట్రుకలు తొలగించడం జరిగిందని , ఇప్పుడు పాప ఆరోగ్యంగా ఉందని , క్రమేపి కోలుకుంటున్నట్లు వెల్లడించారు. వెంట్రుకలు తినటం అనేది ఒక జబ్బు అని దీనిని ట్రైకోఫేజియా అని అంటారని డాక్టర్ అన్వర్ వివరించారు. మానసిక సమస్యల కారణంగా ఈ జబ్బు వస్తుందని ఆయన పేర్కొన్నారు. నెలల తరబడి కడుపులో వెంట్రుకలు పేరుకుపోవడాన్ని ట్రైకోబెజర్ అంటారని వివరించారు.
.
Aksharam Telugu Daily