Tuesday, 14 May 2024 06:39:52 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

బ్రేకింగ్ న్యూస్ పల్స్ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్ "

11 ఏళ్ల చిన్నారి కడుపులోంచి 25cm పొడవు,10cm వెడల్పు చొప్పున వెంట్రుకలు వెలికితీత

Date : 28 March 2024 08:30 PM Views : 635

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : " ● ఖమ్మం జిల్లా/ జడ్పి సెంటర్ /మార్చి.28/ అక్షరం న్యూస్; ఖమ్మం నగరంలోని పల్స్ ఆసుపత్రిలో పదకొండేళ్ల చిన్నారికి అరుదైన ఆపరేషన్ నిర్వహించారు ఆసుపత్రి వైద్యులు. బాలిక కడుపులో నెలల తరబడి పేరుకుపోయిన సుమారు 25 సెంటీ మీటర్ల పొడవు, 10 సెంటీ మీటర్ల వెడల్పుతో జీర్ణాశయానికి అడ్డుగా ఉన్న వెంట్రుకలను తొలగించారు. ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అన్వర్ తెలపిన వివరాల మేరకు. 11 ఏళ్ల అమ్మాయి శరణీ గత కొన్ని నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. పలు ఆసుపత్రులు తిరిగి చికిత్స తీసుకుంటున్నా.. నొప్పి మాత్రం తగ్గడం లేదని, దీంతో ఆ పాప తల్లిదండ్రులు తమ ఆసుపత్రికి రాగా తాము క్షుణ్ణంగా పరీక్షించి పాప వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. అప్పుడప్పుడు పాప వెంట్రుకలు నోట్లో పెట్టుకుని నమలడం చూశామని చెప్పడంతో. పరీక్షలు నిర్వహించగా జీర్ణకోశంలో వెంట్రుకలు అడ్డుందని గుర్తించడం జరిగిందని ,వెంటనే తమ సహచర వైద్యుడు డాక్టర్ ఆనంద్ గౌడ్ పాప తల్లిదండ్రులకు పరిస్థితి వివరించి ఆపరేషన్ చేసి పాప కడుపులో దాదాపు 25సెంటిమిటర్ల పొడవు 10 సెంటిమిటర్ల వెడల్పు చొప్పున వెంట్రుకలు చుట్టుకుని ఆహారాన్ని లోనికి పోనీయకుండా.. అడ్డుగా ఉన్న వెంట్రుకలు తొలగించడం జరిగిందని , ఇప్పుడు పాప ఆరోగ్యంగా ఉందని , క్రమేపి కోలుకుంటున్నట్లు వెల్లడించారు. వెంట్రుకలు తినటం అనేది ఒక జబ్బు అని దీనిని ట్రైకోఫేజియా అని అంటారని డాక్టర్ అన్వర్ వివరించారు. మానసిక సమస్యల కారణంగా ఈ జబ్బు వస్తుందని ఆయన పేర్కొన్నారు. నెలల తరబడి కడుపులో వెంట్రుకలు పేరుకుపోవడాన్ని ట్రైకోబెజర్ అంటారని వివరించారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :